About: http://data.cimple.eu/claim-review/348ef4ad35bd6f9d6328eaaec0249760efbfa0f1ac3ec623a0eb040f     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Wed Feb 12 2025 14:56:04 GMT+0000 (Coordinated Universal Time) ఫ్యాక్ట్ చెక్: పాత వీడియోను ఇటీవల కుంభమేళాలో చోటు చేసుకున్నదిగా ప్రచారం చేస్తున్నారు ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన వేడుకగా గుర్తింపు పొందిన మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభమైంది. ఫిబ్రవరి 26, 2025న Claim : మహాకుంభమేళాలో గంగా నదిలో దేహాలు కొట్టుకుపోతున్నట్లు చూపించే వీడియో ఇదిFact : వీడియో పాతది. గంగా నది ఒడ్డున దేహాలు కనిపించిన ఘటన మే 2021 నాటిదిప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా గుర్తింపు పొందిన మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభమైంది. ఫిబ్రవరి 26, 2025న ముగుస్తుంది. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద ఇప్పటికే 42 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానం చేశారు. మహా కుంభ్కు అధిక సంఖ్యలో యాత్రికులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఫిబ్రవరి 12, 2025న జరిగే మాఘ పూర్ణిమ సందర్భంగా జనం మళ్లీ పోటెత్తనున్నారు. అంతేకాకుండా భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా ప్రయాణీకులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మౌని అమావాస్య రోజున భారీ సంఖ్యలో జనం రావడంతో 30 మంది మరణించారు. 60 మంది గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, యాత్రికులు తెల్లవారుజామున స్నాన ఆచారంలో పాల్గొనడానికి పరుగెత్తడం, ఈ కార్యక్రమంలో రద్దీని నియంత్రించడానికి ఉద్దేశించిన బారికేడ్లను దూకడం వల్ల తొక్కిసలాట సంభవించిందని చెప్పారు. అయితే మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉందని, గంగా నదిలో మృతదేహాలను విసిరి మృతుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం కప్పిపుచ్చిందని కొందరు రాజకీయ నేతలు ఆరోపించారు. “महाकुंभ... भाजपा सरकार के कार्य काल में यूपी गाजीपुर में मोदी योगी सरकार की पोल खोलता यह वीडियो... जिसमें देखा जा सकता है कि, गंगा नदी में सैकड़ों लाशें तैर रही हैं... जहां एक तरफ महाकुंभ का डंका बजाया जा रहा है... वहीँ दूसरी तरफ उसी गंगा में अनगिनत लाशें तैर रही हैं... ये सब इसलिए कि, प्रदेश में झूठे, मक्कारों और बेशर्मों की सरकार जो चल रही है... जिम्मेदार कौन?...” ఒక రిపోర్టర్ మాట్లాడుతున్న వీడియో, గంగా నది ఒడ్డున మృతదేహాలను చూపుతున్న సుదీర్ఘ వీడియో హిందీ క్యాప్షన్తో సర్క్యులేషన్లో ఉంది. “వందలాది మృతదేహాలు గంగా నదిలో వెళుతున్నాయి.. ఓ వైపు మహాకుంభం... మరోవైపు అదే గంగలో లెక్కలేనన్ని మృత దేహాలు ఉన్నాయి... ఇదంతా సిగ్గుమాలిన ప్రభుత్వం చేస్తున్న నిర్వాకం. బాధ్యులెవరూ?" అంటూ ఆ పోస్టు వైరల్ అవుతూ ఉంది. క్లెయిం ఆర్కైవ్ లింకును ఇక్కడ చూడొచ్చు. ఫ్యాక్ట్ చెక్: వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియో ఇటీవలిది కాదు. మహాకుంభమేళా సమయంలో దేహాలు ఒడ్డుకు కొట్టుకువస్తున్నట్లు ఎలాంటి నివేదికలు లభించలేదు. మేము వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్లను సంగ్రహించి, Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. అసలు వీడియో 2021 సంవత్సరం నాటిది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో చోటు చేసుకుందని మేము కనుగొన్నాము. అసలు వీడియోను బ్రజ్భూషణ్ మార్కండేయ అనే యూట్యూబ్ ఛానెల్ లో షేర్ చేశారు. ఆయన సమగ్ర వికాష్ ఇండియాలో మాజీ సభ్యుడు, జిల్లా పంచాయతీ ఘాజీపూర్ మాజీ సభ్యుడు అని మేము కనుగొన్నాము. వీడియో వివరణలో “మేము 17 మే 2021న ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ జిల్లా పరిధిలోని మహమ్మదాబాద్ తహసీల్కు చెందిన హర్ బాలం పూర్ గ్రామానికి సమీపంలో ఉన్నాము. గ్రామం ముందు ఉన్న గంగా తీరంలో రెండు డజన్ల మృతదేహాలు కనిపించాయి. కొన్ని మృతదేహాలు ఇసుకలో, గంగలోపల ఉన్నాయి. కుక్కలు వాటిని తింటున్నాయి. ముఖ్యమంత్రి ల్యాండ్లైన్ నంబర్కు ఫోన్ చేసినా ఎలాంటి స్పందన రాలేదు. మేము మరొక నంబర్కు కాల్ చేసాము, కానీ ఇప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మేము ఘాజీపూర్లోని DM నివాసానికి ఫోన్ చేసినప్పుడు, అందులో పని చేసే ఉద్యోగి మాకు మరొక నంబర్ ఇచ్చాడు. ఆ నంబర్ ను ఎవరూ లిఫ్ట్ చేయలేదు. మేము 112కి కాల్ చేసాము, ఎలాంటి స్పందన లేదు. ఆపై జిల్లా మేజిస్ట్రేట్ నంబర్పై మాట్లాడటానికి ప్రయత్నించాము. మొత్తం సమాచారాన్ని నమోదు చేసాము. గంగానదిలోని ఒక ఘాట్ వద్ద పరిస్థితి ఇలా ఉంటే, బిజ్నోర్ నుండి బల్లియా వరకు గంగాలోని వివిధ ఘాట్ల వద్ద పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం చాలా కష్టం. కుక్కలు మృతదేహాలను తినేస్తున్నాయి. చేపలు ఈ మృతదేహాలను తింటాయి, ప్రజలు ఆ చేపలను తింటారు. గంగాజలంలో స్నానం చేసేవారి మీద ప్రభావం చూపుతుంది. మేము మా ప్రాథమిక విధులను నెరవేర్చాము. నేను ఈ వీడియో చేయకూడదనుకున్నాను, కానీ చాలా మంది స్నేహితుల ఒత్తిడి, తెలివితక్కువ వ్యాఖ్యల కారణంగా, నేను ఈ రోజు నా ప్రాథమిక కర్తవ్యాన్ని నెరవేర్చాను. గంగా, ఇతర నదులలో మృతదేహాలను విసిరేయవద్దని మేము దేశప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. సంబంధిత వారికి కాల్ చేయండి. పరిపాలన, ప్రభుత్వం మద్దతు తీసుకోండి. ఇందుకు సామాజిక కార్యకర్తలు కూడా ముందుకు రావాలి.” అని ఉంది. మా తదుపరి అన్వేషణలో, మే 2021లో ప్రచురించిన NDTV నివేదికను మేము కనుగొన్నాము. గంగా నది ఒడ్డున మృతదేహాలు వరుసగా రెండవ రోజు కూడా కనిపించాయి. ఈసారి ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో అలాంటి ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రదేశం బీహార్లోని బక్సర్ నుండి 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ వందకు పైగా మృతదేహాలు కనుగొనబడ్డాయి. మృతదేహాలను నీళ్లలో వదిలివేసే సంప్రదాయం తమ రాష్ట్రంలో లేదని బీహార్ అధికారులు తెలిపారు. ఉత్తర భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో కోవిడ్-19 వేగంగా వ్యాప్తి చెందుతున్నందున, నదిలోని మృతదేహాలను కోవిడ్-19 పేషెంట్లుగా అనుమానిస్తున్నారు. CNN.comలో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం, తూర్పు భారతదేశంలోని గంగా నది ఒడ్డులో 71 మృతదేహాలు కనిపించాయి. రెండో కోవిడ్ -19 వేవ్ సమయంలో ఇది జరిగిందని నివేదికలు తెలిపాయి. అందువల్ల, వైరల్ వీడియో మహాకుంభమేళాకు సంబంధించినది కాదు. ఇది మే 2021 లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో జరిగింది. Claim : మహాకుంభమేళాలో గంగా నదిలో దేహాలు కొట్టుకుపోతున్నట్లు చూపించే వీడియో ఇది Claimed By : Twitter users Claim Reviewed By : Telugupost Fact Check Claim Source : Twitter Fact Check : False Next Story
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Telugu
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 11 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software