schema:text
| - Mon Jul 29 2024 15:58:21 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: నీట మునిగిన అమరావతిని చూపుతున్న వైరల్ చిత్రం ఇటీవలిది కాదు
గత వారం రోజులుగా ఆంధ్ర ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. కోస్తాoధ్ర లోని పలు ప్రాంతాల్లో వర్షాల కారణంగా జన జీవనానికి అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి.
Claim :వైరల్ చిత్రం ఇటీవలి వరదల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని చూపిస్తుంది
Fact :వైరల్ చిత్రం పాతది.. 2019 సంవత్సరంలో నుండి వైరల్ అవుతూ ఉంది
గత వారం రోజులుగా ఆంధ్ర ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. కోస్తాoధ్ర లోని పలు ప్రాంతాల్లో వర్షాల కారణంగా జన జీవనానికి అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. ఉత్తర ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలు, గోదావరి డెల్టా ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్రలోని ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా ఇన్ ఫ్లో రావడంతో గోదావరి నదిలో నీటిమట్టం పెరుగుతోంది.
వర్షపు నీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తే అనేక దృశ్యాలు ప్రధాన స్రవంతి మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా కనిపించాయి. ఈ పరిస్థితి మధ్య, ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతిలో ప్రస్తుత వరద పరిస్థితిని చూపిస్తూ వరద నీటిలో మునిగిపోయిన అమరావతికి సంబంధించిన ఓ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
“బాబు గారు కడుతున్న సింగపూర్ ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ అయింది అందరు దానిలో దూకి ఎంజాయ్ చేయండి” అంటూ ఓ ఇంస్టాగ్రామ్ యూజర్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
“amravati drainage , will anyone invest here?” అంటూ అదే ఇమేజ్ ను ఎక్స్ లో పోస్టు చేశారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. వైరల్ అవుతున్న చిత్రం ఇటీవలిది కాదు, 2019లో నుండి ఇంటర్నెట్ లో కనిపిస్తోంది.
మేము Googleలో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, వైరల్ ఇమేజ్ 2019 సంవత్సరంలో r/IndiaSpeaks అనే వినియోగదారు షేర్ చేశారని మేము కనుగొన్నాము. ‘Situation in Amaravati (AP) after floods’ అంటూ అప్పట్లోనే ఈ ఫోటోను షేర్ చేశారు.
ఈ చిత్రాన్ని ఆగస్టు 17, 2019న ఫేస్బుక్ వినియోగదారు ‘వరద వస్తే అమరావతి లో పరిస్థితి ఇలా ఉంటుంది' అంటూ షేర్ చేశారు.
ఈ చిత్రాన్ని తర్వాత అనేక న్యూస్ వెబ్సైట్లు తమ కథనాలలో ఉపయోగించుకున్నాయి. అక్టోబర్ 6, 2022న అమరావతిలో వరద పరిస్థితిని చర్చిస్తూ teluguglobal.comలో ప్రచురించిన కథనంలో వైరల్ చిత్రం ఉంది.
మరో Facebook వినియోగదారు కూడా జనవరి 2020లో ఈ చిత్రాన్ని షేర్ చేశారు.
అమరావతి వరద నీటిలో మునిగిందని చూపుతున్న వైరల్ చిత్రం ఇటీవలిది కాదు, ఇది 2019 సంవత్సరానికి చెందినది. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.
News Summary - Viral image showing submerged Amaravati is not recent
Claim : వైరల్ చిత్రం ఇటీవలి వరదల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని చూపిస్తుంది
Claimed By : Instagram, Twitter Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : Misleading
Next Story
|