Wed Feb 12 2025 16:11:40 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: రోడ్డుపై వాటర్ ఫౌంటెన్ వద్ద మహిళ బట్టలు ఉతుకుతున్న వైరల్ వీడియో తెలంగాణకు చెందినది కాదు
తెలంగాణలో ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సమయంలో ఓటర్లకు ‘ఆరు హామీలు’ హామీ ఇచ్చిన ఆ పార్టీ మాట నిలబెట్టుకోలేకపోతోందని విమర్శలు వస్తున్నాయి. ఎండాకాలం కావడంతో దాదాపు అన్ని ప్రధాన రిజర్వాయర్లు ఎండిపోయాయని
Claim :తెలంగాణ మహిళ తన ఇంట్లో నీరు లేకపోవడంతో వాటర్ ఫౌంటెన్ దగ్గర బట్టలు ఉతుకుతున్న వీడియో వైరల్ అయింది
Fact :ఈ వీడియో తెలంగాణాది కాదు, ఆంధ్రప్రదేశ్లోని నిడదవోలుకు సంబంధించినది
తెలంగాణలో ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సమయంలో ఓటర్లకు ‘ఆరు హామీలు’ హామీ ఇచ్చిన ఆ పార్టీ మాట నిలబెట్టుకోలేకపోతోందని విమర్శలు వస్తున్నాయి. ఎండాకాలం కావడంతో దాదాపు అన్ని ప్రధాన రిజర్వాయర్లు ఎండిపోయాయని.. తెలంగాణ తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటోందని పలువురు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో రబీ పంటలకు సాగునీరు అందక అనేక ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది.
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఓ మహిళ క్రాస్రోడ్ జంక్షన్లో ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటెన్ దగ్గర బట్టలు ఉతుకుతున్న వీడియో అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
“ఇండ్లల్లో నీళ్లు లేక రోడ్డుపై ఉన్న వాటర్ ఫౌంటెన్ వద్ద బట్టలు ఉతుక్కుంటున్న తెలంగాణ మహిళలు. ఇట్లాంటి దౌర్భాగ్యమైన పాలన అందిస్తున్న గుంపుమేస్త్రి సన్నాసికి కర్రు కాల్చి వాతపెడితే తప్ప సిగ్గురాదు... #ప్రజాపాలన @revanth_anumula” అంటూ సోషల్ మీడియాలో ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియో తెలంగాణకు చెందినది కాదు.. ఆంధ్రప్రదేశ్కు చెందినది.
వైరల్ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్ లను తీసుకుని.. Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. కొన్ని సోషల్ మీడియా అకౌంట్ లలో ఈ వీడియోను “నిడదవోలులో వాటర్ ఫౌంటెన్ పెడితే బట్టలు ఉతుక్కుంటున్నారు” వంటి క్యాప్షన్లతో షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. ఆంధ్రప్రదేశ్లోని నిడదవోలులో వాటర్ ఫౌంటెన్ను ఏర్పాటు చేయగా.. ప్రజలు ఆ నీటితో బట్టలు ఉతకడం ప్రారంభించారని చెబుతున్నారు.
మరింత సెర్చ్ చేయగా.. వాటర్ ఫౌంటెన్ని ఉపయోగించి ఒక మహిళ తన బట్టలు ఉతుకుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిందని తెలిపే తెలుగు వార్తా కథనాలను కూడా మేము కనుగొన్నాము. ఆంధ్రప్రదేశ్లోని నిడదవోలు అభివృద్ధిలో భాగంగా ఏపీ పర్యాటక శాఖ గణేష్ చౌరస్తా వద్ద వాటర్ ఫౌంటెన్ను నిర్మించగా, ఓ మహిళ బట్టలు ఉతుకుతూ కనిపించింది. ఆ ఫౌంటెన్ను చూసేందుకు వచ్చిన పర్యాటకులు వీడియో చిత్రీకరిస్తుండగా ఆమె చేసిన పని కూడా రికార్డు అయింది.
ఆ వీడియో ఆన్లైన్లో షేర్ చేస్తే వైరల్గా మారింది. సమయం తెలుగు ప్రకారం.. ఆ వాటర్ ఫౌంటెన్ ను స్థానిక ఎమ్మెల్యే జి శ్రీనివాసులు నాయుడ గణపతి సెంటర్ లో ప్రారంభించారు.
వైరల్ అవుతున్న వీడియో తెలంగాణకు చెందినది కాదని.. ఆంధ్రప్రదేశ్లోని నిడదవోలు పట్టణానికి చెందినదని తేలింది. వైరల్ అవుతున్న వాదనలు ప్రజలను తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయి.
News Summary - Viral video showing woman washing clothes at a water foundation on the road is not from Telangana
Claim : తెలంగాణ మహిళ తన ఇంట్లో నీరు లేకపోవడంతో వాటర్ ఫౌంటెన్ దగ్గర బట్టలు ఉతుకుతున్న వీడియో వైరల్ అయింది
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : Misleading
Next Story