About: http://data.cimple.eu/claim-review/23cf93660a877fbae789697c0635796f418305994d091d27a2a2f0c5     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fri Dec 20 2024 14:44:56 GMT+0000 (Coordinated Universal Time) ఫ్యాక్ట్ చెక్: వైఎస్సార్సీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి తన సొంత ప్రభుత్వాన్ని విమర్శించారని జరుగుతున్న ప్రచారం నిజం కాదు, ఆమె 2018లో టీడీపీ పాలనపై మాట్లాడారు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో నాలుగేళ్ల పాలనను పూర్తి చేసుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. Claim :సీఎం జగన్మోహన్రెడ్డి హయాంలో విజయనగరం జిల్లాలో గిరిజనులకు సరైన వైద్యసేవలు అందడం లేదని వైఎస్ఆర్సీ ఎమ్మెల్యే పుష్పాశ్రీవాణి మాట్లాడుతున్న వీడియో. Fact :ఆ వీడియో పాతది, 2018 సంవత్సరంలో టీడీపీ అధికారంలో ఉన్న నాటిది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్రెడ్డి పాలనపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విమర్శలు చేయలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో నాలుగేళ్ల పాలనను పూర్తి చేసుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. గిరిజనులకు సరైన వైద్యసేవలు అందడం లేదని వైఎస్సార్సీ కురుపాం ఎమ్మెల్యే పుష్పాశ్రీవాణి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన వీడియోను కొందరు సోషల్ మీడియా యూజర్లు షేర్ చేస్తున్నారు. సరైన వైద్య సేవలు అందక, సకాలంలో వైద్యం అందక మహిళలు, బాలికలు ఇబ్బందులు పడుతున్నారని అందులో ఆమె ఆరోపించారు. “విజయనగరం జిల్లాలో గిరిజనులకి వైద్య సేవలు అందడం లేదు, బైక్ అంబులెన్సు లు పని చెయ్యట్లేదు, సకాలంలో వైద్య సేవలు అందక ఎందరో బాలికలు, గర్భిణీ మహిళలు చాలా ఇబ్బందులు ఎదురుకుంటూ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు అని @PushpaSreevani గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు... @VidadalaRajini ఇదేనా అంతర్జాతీయ స్థాయి వైద్యం అంటే “ అంటూ పోస్టులు పెడుతున్నారు. “విజయనగరం జిల్లాలో గిరిజనులకి వైద్య సేవలు అందడం లేదు, బైక్ అంబులెన్సు లు పని చెయ్యట్లేదు, సకాలంలో వైద్య సేవలు అందక ఎందరో బాలికలు, గర్భిణీ మహిళలు చాలా ఇబ్బందులు ఎదురుకుంటూ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు అని @PushpaSreevani గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు... @VidadalaRajini ఇదేనా అంతర్జాతీయ స్థాయి వైద్యం అంటే “ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఫ్యాక్ట్ చెకింగ్:వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి వీడియో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనిది. 2018 సంవత్సరంలో ఆమె ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించారు. “Kurupam MLA emotional speech” అనే కీవర్డ్స్ ను ఉపయోగించి గూగుల్ లో సెర్చ్ చేయగా.. సెప్టెంబర్ 5, 2018న అప్లోడ్ చేసిన అనేక YouTube వీడియోలను మేము కనుగొన్నాము. ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి సోషల్ మీడియా ఖాతాలను వెతికితే, ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన అలాంటి వీడియోలు మాకు కనిపించలేదు. ఆమె ఫేస్బుక్ హ్యాండిల్లో, ఆ వీడియో పాతదేనని, తన మీద తప్పుడు ప్రచారం చేయడానికి కొందరు ఆ వీడియోను ఉపయోగిస్తున్నారని ఆమె వివరణ ఇచ్చిన వీడియోను మేము కనుగొన్నాము. “తెలుగుదేశం వాళ్లు నా పై చేసే తప్పుడు ప్రచారానికి నా సమాధానం” అంటూ వివరణ ఇచ్చిన వీడియోను మేము కనుగొన్నాం. 2018 సెప్టెంబర్లో 15 మంది గిరిజన విద్యార్థినులను విజయనగరంలోని సాలూరులోని ఓ ఆసుపత్రిలో కూర్చోబెట్టి చికిత్స అందించారని వీడియోలో వివరించారు. వారందరికీ కూర్చోబెట్టి చికిత్స అందించారు. ఈ ఘటనపై కలత చెందిన ఆమె తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఆమె వైసీపీ పాలనపై అసంతృప్తిగా ఉన్నారంటూ అదే వీడియోను ఉపయోగించి ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. విజయనగరంలో గిరిజనులకు వైద్యసేవలు అందడం లేదని టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కురుపాం ఎమ్మెల్యే పుష్పా శ్రీవాణి పోస్టు చేసిన వీడియో సెప్టెంబర్ 2018 నాటిదని rtvlive.com వివరణ ఇచ్చింది. కాబట్టి, వైరల్ వీడియో ఇటీవలిది కాదు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి తన సొంత పార్టీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారనే వాదన అబద్ధం. 2018లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి వీడియో ఇది. ఇప్పుడు మరోసారి వైరల్గా మారింది. కాబట్టి, వైరల్ వీడియో ఇటీవలిది కాదు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి తన సొంత పార్టీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారనే వాదన అబద్ధం. 2018లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి వీడియో ఇది. ఇప్పుడు మరోసారి వైరల్గా మారింది. News Summary - Video claiming YSRC MLA Pushpa Sreevani criticised her own government is false, she flayed TDP governance Claim : Video shows YSRC MLA Pushpa Sreevani speaking about Girijans not being able to avail themselves of proper medical services in Vizianagaram district under CM Jaganmohan Reddy's rule Claimed By : Social media users Claim Reviewed By : Telugupost Fact Check Claim Source : Social media Fact Check : False Next Story
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Telugu
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 3 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software