schema:text
| - Thu Feb 13 2025 00:48:22 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ లకు చెందిన ఫోటో ఇఫ్తార్ పార్టీకి సంబంధించినది కాదు
మౌలానా అబుల్ కలాం గౌరవార్థం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మొదటి ఇఫ్తార్ విందు అనే వాదనతో భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఇతర నాయకులు డైనింగ్ టేబుల్ వద్ద భోజనం చేస్తున్న చిత్రం వైరల్ అవుతోంది. నెహ్రూ కేబినెట్లో మౌలానా అబుల్ కలాం విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు.
మౌలానా అబుల్ కలాం గౌరవార్థం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మొదటి ఇఫ్తార్ విందు అనే వాదనతో భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఇతర నాయకులు డైనింగ్ టేబుల్ వద్ద భోజనం చేస్తున్న చిత్రం వైరల్ అవుతోంది. నెహ్రూ కేబినెట్లో మౌలానా అబుల్ కలాం విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. చిత్రంలో డాక్టర్ అంబేద్కర్, అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, VK కృష్ణ మీనన్ ఇతరులను చూడవచ్చు.“*కాంగ్రెస్ మొదటి బుజ్జగింపు రాజకీయాలు ఎప్పుడు, ఎందుకు ప్రారంభించారు?*స్వతంత్ర భారతంలో తొలి బుజ్జగింపు!! 1947లో, జవహర్లాల్ నెహ్రూ తన క్యాబినెట్ సహోద్యోగి విద్యా మంత్రి మౌలానా అబుల్ కలాం కోసం ఇఫ్తార్ పార్టీని ఏర్పాటు చేశారు. చిత్రంలో డాక్టర్ అంబేద్కర్ మరియు రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కూడా ఉన్నారు. వీకే కృష్ణ మీనన్ సహా పలువురు మంత్రులు ఉన్నారు.అయితే మీరు ఈ చిత్రంలో సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ను చూడలేరు ఎందుకంటే అతను ఈ ప్రభుత్వ ఇఫ్తార్ విందును వ్యతిరేకించాడు. ఎందుకంటే కొన్ని నెలల క్రితం మేము హోలీ మరియు దీపావళికి హిందువులకు ఎటువంటి పార్టీ ఇవ్వలేదు, అప్పుడు ఈ తప్పుడు సంప్రదాయాన్ని ప్రారంభించడం చెడ్డ విషయం. దేశం కోసం ప్రమాదకరమైనది.నెహ్రూ మొదలెట్టిన ఈ బుజ్జగింపు లాల్ బహదూర్ శాస్త్రి ద్వారా నిలిపివేయబడింది. కానీ ఇందిరా గాంధీ మళ్లీ ప్రారంభించారు. ఆ తర్వాత అది నిరాటంకంగా కొనసాగింది, ఆ తర్వాత నరేంద్ర మోదీ ఈ బుజ్జగింపును ఆపేశారు.” అంటూ పోస్టులను వైరల్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:వైరల్ అవుతున్న పోస్టు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. వైరల్ చిత్రంలో ఉన్నది నెహ్రూ క్యాబినెట్ కోసం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ పార్టీ కాదు.. ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ మంత్రివర్గం కోసం ఏర్పాటు చేసిన విందుకు సంబంధించినది.మేము Google రివర్స్ ఇమేజ్ శోధనను నిర్వహించినప్పుడు, చిత్రం స్టాక్ ఇమేజ్ వెబ్సైట్, అలమీలో అప్లోడ్ చేసినట్లు మేము కనుగొన్నాము. మరాఠీలో చిత్రం శీర్షిక ఇలా ఉంది “मराठी: चक्रवर्ती राजगोपालचारी हे पहिले भारतीय जनरल गव्हर्नर बनण्याचा आनंदात वल्लभभाई पटेलांनी मंत्रीमंडळाला दिलेल्या सहभोजन निमंत्रणाला उपस्थित डॉ. बाबासाहेब आंबेडकर, जवाहरलाल नेहरू, मौलाना आझाद व इतर मंत्री. जून १९४८; June 1948; Unknown author; "అందులో “డా.బాబాసాహెబ్ అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూ, మౌలానా ఆజాద్, ఇతర మంత్రులు భారతదేశ గవర్నర్ జనరల్గా ఎన్నికైన డాక్టర్ చక్రవర్తి రాజగోపాలాచారి గౌరవార్థం విందులో పాల్గొన్నారు" అని ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి mid-day.comలో ప్రచురించబడిన కథనాన్ని స్టాక్ ఇమేజ్ ఉటంకించింది.
2017లో అదే డిన్నర్ పార్టీని వేరే కోణంలో చూపించే మరో చిత్రాన్ని BBC మరాఠీ ప్రచురించింది. భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్గా గోపాలాచారి ఎన్నికైనందుకు గుర్తుగా సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ లంచ్ను నిర్వహించారని చిత్రం శీర్షిక పేర్కొంది. ప్రధాని నెహ్రూతో పాటు డా. అంబేద్కర్, ఇతర మంత్రులను చూడవచ్చు. – జూన్ 1948.తదుపరి పరిశోధనలో, ఈ చిత్రాన్ని ఇండియన్ ప్రెస్ ఫోటోగ్రఫీకి చెందిన ప్రథమ మహిళ హోమై వ్యారావల్లా తీశారని కూడా మేము కనుగొన్నాము. ఆమె చిత్రీకరించిన కొన్ని అరుదైన ఛాయాచిత్రాలను ఈ నివేదికలో చూడవచ్చు.నివేదికలో ప్రచురించిన చిత్రం స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది.
వైరల్ అవుతున్న చిత్రం నెహ్రూ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ఇఫ్తార్ పార్టీకి సంబంధించినది కాదు. ఇది భారత గవర్నర్ జనరల్గా సి రాజగోపాలాచారి ఎన్నికైనప్పుడు సర్దార్ పటేల్ ఇచ్చిన విందుకు సంబంధించినది.
News Summary - Viral image showing Nehru and his Cabinet at a dinner table is of a banquet held by Sardar Vallabhbhai Patel but not an Iftar party
Claim : Nehru cabinet gave the first iftar party
Claimed By : Facebook Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Facebook
Fact Check : Misleading
Next Story
|