schema:text
| - ఫ్యాక్ట్ చెక్: సద్గురు కౌగిలించుకున్న మహిళ ఆయన కుమార్తె రాధే జగ్గీ
మహాశివరాత్రి రోజు రాత్రి కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలో జరిగిన మహాశివరాత్రి వేడుకలకు లక్షలాది మంది హాజరయ్యారు.
Claim :
ఇషా సెంటర్లో మహాశివరాత్రి వేడుకల సందర్భంగా సద్గురు ఒక మహిళను హత్తుకుని నృత్యం చేశారుFact :
సద్గురు తన కుమార్తె రాధే జగ్గీతో కలిసి నృత్యం చేశారు, ఆమె ప్రఖ్యాత భరతనాట్యం నృత్యకారిణి.మహాశివరాత్రి రోజు రాత్రి కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలో జరిగిన మహాశివరాత్రి వేడుకలకు లక్షలాది మంది హాజరయ్యారు. శివరాత్రి రోజు ఇషా సెంటర్ లో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వేడుకల్లో పాల్గొని మాట్లాడుతూ మహాశివరాత్రి కేవలం పండుగ మాత్రమే కాదని, దానికి శాస్త్రోక్తమైన ప్రాముఖ్యత ఉందన్నారు. ఇషా సంస్థ 'సేవ్ సాయిల్' ఉద్యమం, జాతీయ స్థాయిలో సంస్కృతిని పరిరక్షించడంలో ఆ సంస్థ పాత్రను అమిత్ షా హైలైట్ చేశారు. యోగా పురాతనమైనప్పటికీ, అది నేటికీ మనతోనే ఉందని ఆయన అన్నారు. తమిళ సాహిత్యం, సంస్కృతి లేకుండా భారతదేశ చరిత్ర అసంపూర్ణమని, తమిళనాడు అనేక వారసత్వ దేవాలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు నిలయంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ కూడా హాజరయ్యారు. ఇక ఇషా ఫౌండేషన్ పై వచ్చిన నేరారోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విచారణలో ముగ్గురు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)లు భాగంగా ఉన్నారు, వారు విస్తృతమైన సోదాలను కూడా చేపట్టారు. పోలీసుల బృందం పర్యటనపై ఈషా యోగా కేంద్రం స్పందిస్తూ, పోలీసుల సోదాలు సాధారణ విచారణలో భాగమని పేర్కొంటూ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఫ్యాక్ట్ చెక్:
ఇండియా.కామ్ లో మహాశివరాత్రి సందర్భంగా ప్రచురించిన వీడియో లో కూడా ఆమె తన తండ్రి గురించీ మాట్లడటం మనం చూడొచ్చు. భారతదేశంలోని అత్యంత ప్రఖ్యాత సాధువు కుమార్తెగా తన జీవితం గురించి మాట్లాడారు, శివుడు, రావణుడి కథను కూడా పఠించారు.ఆ కధనం ఈ లింకులో చూడొచ్చు. అందువల్ల, వైరల్ వీడియోలో ఇషా ఫౌండేషన్కు చెందిన సద్గురు తన సొంత కుమార్తెతో కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. వైరల్ వాదనలో ఎలాంటి నిజం లేదు.
|