About: http://data.cimple.eu/claim-review/fc396df0a09cbe3ff086e71fcf34a6b232fed0f3b80d608e45a3cba6     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • వాస్తవ తనిఖీ: అసోం లో మదర్సాలను పూర్తిగా మూసివేయాలని గువహాటి ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వలేదు, వైరల్ పోస్ట్ తప్పుదోవపట్టించేది వైరల్ పోస్ట్ లో పేర్కొనబడిన విధంగా అన్ని మదర్సాలను మూసివేయాలని గువహాటి ఉన్నత న్యాయస్థానము తీర్పు చెప్పలేదు అని విశ్వాస్ న్యూస్ తన విచారణలో కనుగొనింది. కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించబడే ప్రాంతీయీకరించబడిన మదర్సాలు మాత్రమే మూసివేయబడతాయి. కాబట్టి ఈ వైరల్ పోస్ట్ తప్పుదోవపట్టించేది. - By: Team Vishvas - Published: Feb 28, 2022 at 11:21 AM గువహాటి (విశ్వాన్ న్యూస్): అసోం లో మదర్సాలను పూర్తిగా మూసివేయాలని గువహాటి ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది అని క్లెయిమ్ చేస్తూ సోషల్ మీడియా పై ఒక పోస్ట్ ఇటీవల వైరల్ అయింది. కొన్ని మీడియా అవుట్లెట్లు కూడా ఈ వార్తను తెలియజేశాయి. ఈ క్లెయిమ్ తప్పుదోవపట్టించేదిగా విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అసోంలో నడుస్తున్న మదర్సాలను మూసివేసే ఆలోచనకు అనుకూలంగా గువహాటి ఉన్నత న్యాయస్థానం తీర్పును ఇచ్చింది. ఈ తీర్పు రాష్ట్ర ప్రాంతీయ మదర్సాలు సాధారణ పాఠశాలలుగా మారుటకు దారితీస్తుంది. “కమ్యూనిటి మదర్సాలు” లేదా “క్వామి మదర్సాలు” మరియు “మక్తాబ్స్” ఇదివరకటి మాదిరిగానే కొనసాగుతాయి. ఈ వైరల్ పోస్ట్ ఏమిటి? ఫేస్బుక్ పేజ్ অসমৰ খবৰ ఈ వైరల్ పోస్ట్ ను ఫిబ్రవరి 5, 2022 నాడు షేర్ చేశారు మరియు ఇలా వ్రాశారు: XXX ఆంగ్లానువాదం – రాష్ట్రములోని మదర్సాలు అన్నీ పూర్తిగా మూసివేయబడతాయి. మదర్సాల మూసివేత నిర్ణయానికి ఉన్నత న్యాయస్థానం అంగీకారం తెలిపింది. అలాగే బ్రేకింగ్ న్యూస్ ప్లేట్ ఫోటో కూడా షేర్ చేయబడింది. అందులో కూడా ఇదే వార్త వ్రాయబడింది మరియు ఆ పోస్ట్ లో గువహాటి ఉన్నత న్యాయస్థానం యొక్క ఫోటో కూడా ఉంది. ఇతర సోషల్ మీడియా యూజర్స్ కూడా ఇటువంటి ఫోటోలనే షేర్ చేశారు. పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ లింక్ ను మీరు ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్చు. దర్యాప్తు విశ్వాస్ న్యూస్ గూగుల్ పై సంబంధిత కీవర్డ్స్ తో సెర్చ్ చేయడము ప్రారంభించారు మరియు అనేక కథనాలను కనుగొన్నారు. వార్తా నివేదికల ప్రకారం, గువహాటి ఉన్నత న్యాయస్థానం అసోంలో రాష్ట్ర ప్రభుత్వ నిధితో నడుస్తున్న రాష్ట్ర మదర్సాలను ఇప్పటి నుండి సాధారణ పాఠశాలలుగా మార్చబడతాయి అని తీర్పు ఇచ్చింది. మా దర్యాప్తులో, LiveLaw.in వెబ్సైట్ పై గువహాటి ఉన్నత న్యాయస్థానం యొక్క తీర్పును పూర్తిగా కనుగొన్నాము. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడిచే మదర్సాలను అన్నిటిని ఇప్పటి నుండి మూసివేయాలి అని అందులో పేర్కొనబడింది. అసోం రిపెల్లింగ్ చట్టము 2020 ను సవాలు చేస్తూ గువహాటి ఉన్నత న్యాయస్థానములో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేయబడింది. 14 మందిచే దాఖలు చేయబడిన ఈ పిటిషన్ లో రాష్ట్రములో మదర్సా విద్య కొనసాగాలి అని పేర్కొనింది. కాని విచారణ చివరిలో గువహాటి ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి సుధాంశు ధుల్యా మరియు జస్టిస్ సౌమిత్ర సైకియా ఉన్న ధర్మాసనం ఈ పిటిషన్ ను కొట్టివేసింది. ఇక్కడ క్లిక్ చేసి మీరు ఈ వార్తలను చదవవచ్చు. ఈ తీర్పును మీరు ఇక్కడక్లిక్ చేసి చదవవచ్చు. ఈ వైరల్ పోస్ట్ గురించి అసోం ముఖ్యమంత్రి డా. హిమంత బిశ్వ శర్మ యొక్క ట్విట్టర్ ప్రొఫైల్ పై ఒక పోస్ట్ ను మనం చూడవచ్చు. రాష్ట్ర ప్రభుత్వముచే అమలుచేయబడిన మదర్సా ఎడ్యుకేషన్ ప్రొవిన్సిలైజేషన్ చట్టాన్ని ఉపసంహరించుకొనుటకు గువహాటి ఉన్నత న్యాయస్థానము 2020 చట్టాన్ని అప్టర్న్ చేసింది అని కూడా ఇందులో పేర్కొనబడింది. The Economic Times నివేదికలో కూడా ఇదే విషయం పేర్కొనబడింది. ఈ సందర్భములో విశ్వాస్ న్యూస్ వారు ఆనంద్ బజార్ పత్రిక యొక్క ఈశాన్య ప్రాంత ప్రిన్సిపల్ కరస్పాండెంట్ ను సంప్రదించారు మరియు వైరల్ పోస్ట్ ను షేర్ చేశారు. ఇది తప్పుదోవపట్టించేది అని ఆయన మాకు తెలిపారు. గువహాటి ఉన్నత న్యాయస్థానము రాష్ట్రములోని అన్ని మదర్సాలను మూసివేయాలని తీర్పు చెప్పలేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వచే నిధులు సమకూర్చబడే స్థానిక మదర్సాలు మాత్రమే మూసివేయబడతాయి. కమ్యూనిటి ఆధారంగా నిర్వహించబడే మదర్సాలు ఇదివరకు మాదిరిగానే కొనసాగుతాయి. దర్యాప్తు యొక్క చివరి దశలలో, మేము ఫేస్బుక్ పై ఈ తప్పుదోవపట్టించే పోస్ట్ ను షేర్ చేసిన অসমৰ খবৰ యొక్క ఫేస్బుక్ ప్రొఫైల్ ను స్కాన్ చేశాము. ఈ పేజ్ 68592 మందిచే అనుసరించబడుతోందని కనుగొన్నాము. निष्कर्ष: వైరల్ పోస్ట్ లో పేర్కొనబడిన విధంగా అన్ని మదర్సాలను మూసివేయాలని గువహాటి ఉన్నత న్యాయస్థానము తీర్పు చెప్పలేదు అని విశ్వాస్ న్యూస్ తన విచారణలో కనుగొనింది. కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించబడే ప్రాంతీయీకరించబడిన మదర్సాలు మాత్రమే మూసివేయబడతాయి. కాబట్టి ఈ వైరల్ పోస్ట్ తప్పుదోవపట్టించేది. - Claim Review : అసోం లో మదర్సాలను పూర్తిగా మూసివేయాలని గువహాటి ఉన్నత న్యాయస్థానము తీర్పు ఇచ్చింది - Claimed By : অসমৰ খবৰ - Fact Check : False Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 3 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software