ఫ్యాక్ట్ చెక్: మహిళలను కాపాడిన విజువల్స్ ను వారితో అసభ్య ప్రవర్తనకు సంబంధించిన వీడియోగా ప్రచారం చేస్తున్నారు
మహిళలను కాపాడిన విజువల్స్ ను వారితో అసభ్య ప్రవర్తనకు సంబంధించిన వీడియోగా
Claim :
కుంభమేళా సమయంలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారుFact :
నీటిలో మునిగిపోతున్న మహిళను కాపాడిన విజువల్స్ ఇవి144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా ఉత్తర్ప్రదేశ్ ప్రయాగ్రాజ్లోని గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద అత్యంత ఘనంగా నిర్వహించారు. 2025 సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 13వ తేదీన ప్రారంభం అయిన ఈ మహా కుంభమేళా 2025 మహా శివరాత్రి సందర్భంగా 26వ తేదీతో ముగిసింది. మొత్తంగా 45 రోజుల్లో 66 కోట్లకు పైగా భక్తులు మహా కుంభమేళాకు వచ్చినట్లు ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనంగా రికార్డుల్లోకి ఎక్కింది. తదుపరి కుంభమేళా 2027లో జరగనుంది. మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వర్ వద్ద ఈ కుంభమేళాను మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. నాసిక్ పట్టణానికి 38 కిలోమీటర్ల దూరంలో ఈ కుంభమేళా జరగనుంది. దేశంలోనే రెండో అతి పొడవైన నది అయిన గోదావరి నది ఇక్కడే జన్మిస్తుంది. ఇక 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వర్ శివాలయం ఇక్కడ ఉంటుంది. ఇక అక్కడ జరిగే కుంభమేళాను 2027 జులై 17వ తేదీ నుంచి ఆగస్ట్ 17వ తేదీ వరకు నిర్వహించనున్నారు.