About: http://data.cimple.eu/claim-review/80032578064b7d9e61b16802fe26dc9ed9a60a822a06e55caa17f8a7     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fri Oct 31 2025 22:25:20 GMT+0000 (Coordinated Universal Time) ఫ్యాక్ట్ చెక్: పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ అక్కడే ఉన్నారు మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ Claim : మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించే చర్చలో ప్రధాని మోదీ పాల్గొనలేదుFact : మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించే చర్చలో ప్రధాని మోదీ పార్లమెంట్ లోనే ఉన్నారుమహిళా రిజర్వేషన్ బిల్లు.. 'నారీ శక్తి వందన్ అధినియం' ఆమోదం పొందే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ చర్చకు గైర్హాజరయ్యారని చెబుతూ ఓ ఇన్ఫోగ్రాఫిక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం జరిగిన చర్చలో ప్రధాని మోదీ పాల్గొనలేదన్న వాదన ఆ పోస్టును వైరల్ చేస్తూ ఉన్నారు. ఇన్ఫోగ్రాఫిక్లో, నితిన్ గడ్కరీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్.. ఇతర బీజేపీ ఎంపీలు పార్లమెంట్ హౌస్లో కూర్చున్నట్లు చూడవచ్చు. ఈ చిత్రంలో ప్రధాని మోదీ కనిపించ లేదు. ఇన్ఫోగ్రాఫిక్తో పాటూ షేర్ చేస్తున్న టెక్స్ట్ లో “మహిళలకు ఎంతో చేస్తున్నానని చెప్పే ప్రధాని మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు గైర్హాజరు కావడం దురదృష్టకరం.” అని ఉంది. ఫ్యాక్ట్ చెకింగ్: ఈ ప్రచారం తప్పు అని చెప్పే అనేక సాక్ష్యాలు ఉన్నాయి. పలు మీడియా కథనాలు.. పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి చర్చ జరిగే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ అక్కడే ఉన్నారని చూపిస్తున్నాయి. అనేక వార్తా నివేదికలు వైరల్ పోస్టులలో నిజం లేదని నిరూపిస్తున్నాయి. బిల్లు ఆమోదం పొందే సమయంలో ప్రధాని నరేంద్రమోదీ అక్కడే ఉండి అందుకు పూర్తి మద్దతుగా నిలిచారు. సెప్టెంబరు 19న కొత్త పార్లమెంట్ హౌస్లో తొలిరోజు సెషన్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత ప్రధాని మోదీ కీలక ప్రసంగం కూడా చేశారు. ఓటింగ్ ప్రారంభమయ్యే ముందు సభలో ప్రసంగిస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లుపై తమ అభిప్రాయాన్ని బలంగా వినిపించారు. బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఎగువ సభలో మోదీ మాట్లాడుతూ, “ఈ రోజు మనం మహిళా సాధికారత దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేస్తున్నాం.. ఈ రోజు (సెప్టెంబర్ 19, 2023) చిరస్మరణీయమైన రోజు, చారిత్రాత్మకమైన రోజు.. మహిళల నేతృత్వంలో భారతదేశం అభివృద్ధి సాధిస్తోంది. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళల ప్రాతినిథ్యాన్ని విస్తృతం చేయడమే ఈ బిల్లు లక్ష్యం. 'నారీ శక్తి వందన్ అధినియం' ద్వారా మన ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది." అని అన్నారు. ప్రధాని మోదీ ప్రసంగానికి సంబంధించిన వీడియోను ఈ లింక్ లో చూడొచ్చు. మహిళా సాధికారత బిల్లుపై ఓటింగ్ జరిగే సమయంలో కూడా ప్రధాని మోదీ అక్కడే ఉన్నారు. బిల్లు పాస్ అయ్యాక ప్రధాని మోదీ.. పలు మహిళా ఎంపీలకు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ లో బిల్లు పాస్ అవ్వడంపై హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ. అందుకు సహకరించిన పార్లమెంట్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్ లో మహిళా బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ప్రధాని మోదీ అక్కడే ఉన్నారు. వైరల్ అవుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదు. Claim : PM Modi did not participate in the discussion for passing the Women's Reservation Bill Claimed By : Social Media Users Claim Reviewed By : TeluguPost Fact Check Claim Source : Social Media Fact Check : False Next Story
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Telugu
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software