schema:text
| - Wed Feb 12 2025 22:02:15 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏడుస్తూ మాట్లాడలేదు
మే 13న లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల నాలుగో దశలో భాగంగా మే 13న 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి
Claim :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రజల సానుభూతి పొందేందుకు ఏడుస్తూ మాట్లాడారు
Fact :ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్రెడ్డి ఏడుస్తూ మాట్లాడలేదు.. ఆయన తన ఒరిజినల్ వాయిస్ లోనే మాట్లాడారు
మే 13న లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల నాలుగో దశలో భాగంగా మే 13న 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2019లో జగన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాల్లో విజయం సాధించి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అదే సమయంలో రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలకు గానూ 22 స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీకి గట్టి పోటీనిచ్చేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి.
ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బాధతో మాట్లాడిన వీడియో వైరల్గా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో, ‘ఎన్నికలు సజావుగా జరగడం అనుమానమే. అధికారులను ఇష్టానుసారంగా మారుస్తున్నారని, పేద ప్రజలకు అందాల్సిన ప్రయోజనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ అధికారంలోకి రాకుండా ఆపడానికి ఇదంతా జరుగుతోంది' అని ఆయన అనడం వినొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. అసలు వీడియోలో జగన్ ఏడుస్తూ మాట్లాడిన ఆడియో లేదు. ఆయన వాయిస్ మామూలుగానే ఉంది.
మేము వీడియో నుండి కీఫ్రేమ్లను తీసుకుని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ని ఉపయోగించాం. మచిలీపట్నంలో వైసీపీ నిర్వహించిన బహిరంగ సభను చూపించినట్లు మేము కనుగొన్నాము. వైరల్ వీడియోలో మచిలీపట్నం నుండి పోటీ చేస్తున్న YSRC పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి - పేర్ని కిట్టును కూడా మనం చూడవచ్చు.
మచిలీపట్నంలో జగన్ ప్రచారం సందర్భంగా ఆయన ప్రసంగాన్ని అప్లోడ్ చేసిన కొన్ని యూట్యూబ్ వీడియోలు మాకు కనిపించాయి. సాక్షి టీవీ లైవ్లో అప్లోడ్ చేసిన వీడియోలో, ఎమ్మెల్యే అభ్యర్థిగా పేర్ని కిట్టుగా పరిచయం చేసిన వీడియో మాకు కనిపించింది.
“సీఎం శ్రీ వైయస్ జగన్ మచిలీపట్నం మీటింగ్ మచిలీపట్నం సిద్ధం!” అంటూ కెకెఆర్ మీడియా ఎక్కువ నిడివి ఉన్న వీడియోను ప్రచురించింది. 13 నిమిషాల వీడియోలో వైరల్ అవుతున్న వైరల్ ప్రసంగం లేదు.
తదుపరి శోధనలో, మే 6, 2024న సాక్షి టీవీ లైవ్ ప్రచురించిన మచిలీపట్నం వైసీపీ బహిరంగ సభ ప్రత్యక్ష ప్రసార వీడియోని కూడా మేము కనుగొన్నాము. AP CM YS Jagan Public meeting at Machilipatnam I AP elections 2024 I Krishna District అనే టైటిల్ తో వీడియోను పోస్టు చేశారు. మేము 56 నిమిషాల నిడివిగల ఒరిజినల్ వీడియోలో వైరల్ క్లిప్ ను కనుగొనలేకపోయాము.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్ ఈ సమావేశంలో సీఎం జగన్ మామూలుగా మాట్లాడడం, ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడడం, ఆయన పార్టీ అభ్యర్థిని ప్రశంసించడం ఉన్న వీడియోను ప్రచురించింది. కొన్ని టీవీ ఛానళ్లు ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తలపై కూడా ఆయన మాట్లాడారు.
సమావేశానికి సంబంధించి వచ్చిన మీడియా కథనాలు కూడా అటువంటి సంఘటనను ప్రచురించలేదు. HMTV వెబ్సైట్లో ప్రచురించిన తెలుగు వార్తా నివేదికకు సంబంధించిన లింక్ ఇక్కడ ఉంది.
ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏడుస్తూ మాట్లాడుతున్న వైరల్ వీడియోలో ఎటువంటి నిజం లేదు. మచిలీపట్నంలో జగన్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వీడియోకు ఒరిజినల్ ఆడియో స్థానంలో కల్పిత ఆడియోను జోడించారు. ఆడియోను ఎడిట్ చేశారు.
News Summary - Jaganmohan Reddy did not speak in a shriek voice during poll campaign
Claim : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రజల సానుభూతి పొందేందుకు ఏడుస్తూ మాట్లాడారు
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story
|