About: http://data.cimple.eu/claim-review/daab017d165b2c9a2bb5e44982a2d3162a737a682a7941f4ff45216a     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Thu Jul 18 2024 20:06:01 GMT+0000 (Coordinated Universal Time) ఫ్యాక్ట్ చెక్: యాత్ర-2 సినిమా చూడాలి, చూపించాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేయలేదు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘యాత్ర-2’. ఈ సినిమా ఫిబ్రవరి 8, 2024న విడుదలైంది. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించారు. 2019 లో వచ్చిన 'యాత్ర'కి సీక్వెల్ ఈ సినిమా. Claim :‘యాత్ర-2’ సినిమా చూడాలంటూ ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. Fact :అలాంటి జీవో ఏదీ ఏపీ ప్రభుత్వం జారీ చేయలేదు.. వైరల్ అవుతున్న ఫోటోను డిజిటల్ గా ఎడిట్ చేశారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘యాత్ర-2’. ఈ సినిమా ఫిబ్రవరి 8, 2024న విడుదలైంది. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించారు. 2019 లో వచ్చిన 'యాత్ర'కి సీక్వెల్ ఈ సినిమా. సినిమా విడుదలైన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాను ప్రభుత్వ అధికారులు.. ఉద్యోగులు చూడాలంటూ జారీ చేసిన జీఓ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. “GO చూడండి..మన ఖర్మ... కాకపోతే, ప్రభుత్వం సినిమాలు తీయడం ఏంటి...అది చూడండీ..చూపండి..అని IAS, IPS, లాంటి వాళ్ళకి GO లు పంపడం ఏంటి? దానికి half day సెలవు ఇవ్వడం ఏంటి? .......యాత్ర 2 సినిమా ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు తప్పకుండా చూడాలని, ప్రభుత్వ ఉద్యోగులకు సినిమా...” అంటూ పోస్టులు కొందరు పెడుతూ ఉన్నారు. 'యాత్ర-2' చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారని.. థియేటర్ యజమానులతో ఒప్పందాలు చేసుకున్నారని వైరల్ పోస్టులో చెబుతున్నారు. ప్రతి గ్రామం/వార్డు వాలంటీర్కి ఒక్కో షోకి 10 టిక్కెట్లు కేటాయించేలా.. వివిధ స్థాయిల ప్రభుత్వ అధికారులకు GO లో చెప్పినట్లుగా ఉన్నాయి. ఫ్యాక్ట్ చెకింగ్: వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి జీవో వచ్చినట్లుగా ఎలాంటి ప్రకటన లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్సైట్ ను సెర్చ్ చేయగా.. యాత్ర -2 సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వు లేదు. జిఓ అంటూ వైరల్ అవుతున్న పోస్టును గమనించగా.. జిఓలో ప్రస్తావించబడిన 'నీలం సాహ్ని' గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా కెఎస్ జవహర్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నారని మేము కనుగొన్నాము. దీని ద్వారా అది నకిలీ అని నిర్ధారించవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తన X ఖాతాలో GO వార్తలు ఫేక్ అని.. నీలం సాహ్ని ఆంధ్రప్రదేశ్ సిఎస్ కాదని పేర్కొంటూ ఒక క్లారిటీ ఇచ్చింది. ఇండియా టుడే కూడా వైరల్ అవుతున్న జిఓ కల్పితమని ధృవీకరిస్తూ కథనాన్ని ప్రచురించింది. అందుకే, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో వైరల్ అవుతున్న ప్రభుత్వ ఉత్తర్వు కల్పితమని మేము ధృవీకరించాం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది కాదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. News Summary - AP govt did not issue GO about Yatra-2 movie Claim : Andhra Pradesh government issued GO mentioning the guidelines to government employees on watching movie ‘Yatra-2’ Claimed By : Social media users Claim Reviewed By : Telugupost Fact Check Claim Source : Social media Fact Check : False Next Story
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Telugu
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software