Tue Aug 20 2024 15:39:39 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ప్రధాని మోదీ కర్ణాటక పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రజలు ఆయనను చూడడానికి రాలేదంటూ జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా కూడా ప్రజలు ఆయనను చూడడానికి పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. ఇక బీజేపీ శ్రేణులు కూడా ఆయనకు భారీ ఎత్తున స్వాగతం పలుకుతూ ఉంటాయి.
భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా కూడా ప్రజలు ఆయనను చూడడానికి పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. ఇక బీజేపీ శ్రేణులు కూడా ఆయనకు భారీ ఎత్తున స్వాగతం పలుకుతూ ఉంటాయి. ఆయన ఇటీవల కర్ణాటక పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన్ను చూడడానికి పెద్దగా జనం రాలేదని చెబుతూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వస్తున్నారు.మాండ్య, హుబ్బలి-ధార్వాడ్లలో పలు కార్యక్రమాలకు హాజరయ్యేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అనంతరం హుబ్బలి-ధార్వాడలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.ఇంతలో, మోదీ రోడ్ షోలో ఆయన మాటలు వినడానికి ఎవరూ రాలేదు అనే వాదనతో ఆయన కాన్వాయ్ ఉన్న చిత్రం వైరల్ అవుతోంది. ఆయన అభివాదం చేస్తుండగా ఆయన వెనుక ప్రజలు ఎవరూ కనిపించలేదు.“ಭ್ರಷ್ಟ ಬಿಜೆಪಿ ಸರ್ಕಾರ ತಲೆಗೆ ಸಾವಿರ ಕೊಟ್ಟು ಜನರನ್ನು ಕರೆದರೂ ಕೂಡ ಮೋದಿ ರ್ಯಾಲಿಗೆ ಜನ ಸೇರಲೇ ಇಲ್ಲ.. ಮಂಡ್ಯದವರು ನಿಜಕ್ಕೂ ಸ್ವಾಭಿಮಾನಿಗಳು..” అంటూ కన్నడ భాషలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతూ ఉంది. "వేలకు వేలు డబ్బులు చెల్లించి బీజేపీ ప్రభుత్వం ప్రజలను పిలిచినా మోదీ ర్యాలీకి జనం రాలేదు.. నిజంగా మాండ్యా ప్రజలు స్వాభిమానులు.." అని ఆ పోస్టు అర్థం.
ఫ్యాక్ట్ చెకింగ్:వైరల్ అవుతున్న పోస్టులో ఎలాంటి నిజం లేదు.మేము భారత ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక పర్యటన, ఆయన రోడ్ షో గురించి వివరాలను శోధించినప్పుడు, ప్రధానమంత్రి తన పర్యటనకు సంబంధించిన విజువల్స్ కు సంబంధించి తన ట్విట్టర్ హ్యాండిల్లో ఒక వీడియోను అప్లోడ్ చేశారు.ఈ వీడియోలో చాలా మంది ప్రజలు ఈవెంట్లకు హాజరయ్యారు. ప్రధాని మోదీపై పూల వర్షం కురిపించారు.
ప్రధాని మోదీ రోడ్షో కు సంబంధించిన వీడియోను ANI ట్వీట్ చేసిందని మేము కనుగొన్నాము, అనేక మంది ప్రజలు నిలబడి ఆయనకు స్వాగతం పలికారు.
ప్రధాని మోదీ రోడ్షో వీడియోను ఎకనామిక్ టైమ్స్ కూడా అప్లోడ్ చేసింది. “కర్ణాటకలోని బెలగావిలో రోడ్షోలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఈ ప్రాంతం చుట్టూ 5,000 మంది పోలీసులను మోహరించారు." అని ఉంది.
టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా "వేలాది మంది ప్రజలు మాండ్యా వీధుల్లో స్వాగతం పలికేందుకు బారులు తీరారు." అంటూ వీడియోను పోస్ట్ చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకకు వెళ్ళినప్పుడు.. ఆయన రోడ్షోకి ఎవరూ హాజరు కాలేదన్న వాదన అవాస్తవం.
News Summary - Social media post claiming Modi’s Karnataka visit was lackluster is false
Claim : Modi's road show in Karnataka was empty
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story